తునిలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

By narsimha lodeFirst Published Nov 17, 2022, 9:31 AM IST
Highlights

కాకినాడ జిల్లా  తునిలో  టీడీపీ  నేత శేషగిరిరావుసై  గుర్తు  తెలియని  దుండగుడు  దాడి చేశాడు.  ఈ  దాడిలో  గాయాలపాలైన  శేషగిరిరావును  కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 

తుని:కాకినాడ  జిల్లా తునిలో  టీడీపీ నేత  శేషగిరిరావుపై  హత్యాయత్నం జరిగింది. భవానీ మాలలో  వచ్చిన  ఓ  దుండగుడు  శేషగిరిరావుపై  హత్యాయత్నానికి పాల్పడ్డాడు.  దుండగుడు  దాడి చేయడంతో  కేకలు  వేశాడు  శేషగిరిరావు.  శేషగిరిరావు  కేకలు  విన్న  కుటుంబసభ్యులు  ఇంటి నుండి  బయటకు  వచ్చారు. అప్పటికే  నిందితుడు  బైక్ పై  పారిపోయాడు.  నిందితుడు  దాడి చేసే సమయంలో  చేయిని  అడ్డుపెట్టాడు  శేషగిరిరావు.  దీంతో  శేసగిరిరావు  చేయికి తీవ్ర గాయాలయ్యాయి.  శేషగిరిరావును  కుటుంబసభ్యులు  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శేషగిరిరావు  చికిత్సపొందుతున్నాడు.శేషగిరిరావుపై  దుండగుడు  కత్తితో  దాడి చేసిన  దృశ్యాలు  సీసీటీవీ కెమెరాల్లో  రికార్డయ్యాయి.  శేషగిరిరావు కుటుంబ సభ్యుల  ఫిర్యాదు  మేరకు  పోలీసులు కేసు  నమోదు చేసుకొని  దర్యాప్తు  చేస్తున్నారు. 
 

click me!