శాసనమండలి చీఫ్ విప్ గా ఉమ్మారెడ్డి, టీడీపీపక్ష నేతగా యనమల

Published : Jun 18, 2019, 07:25 PM IST
శాసనమండలి చీఫ్ విప్ గా ఉమ్మారెడ్డి, టీడీపీపక్ష నేతగా యనమల

సారాంశం

నిన్నటి వరకు శాసనమండలిలో వైయస్ఆర్సీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. అయితే ఆ పదవి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాబోస్ కు కేటాయించడంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును చీఫ్ విప్ గా నియమించారు. ఇకపోతే ప్రభుత్వ విప్ గా గంగుల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.    

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిమితులయ్యారు. విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. 

నిన్నటి వరకు శాసనమండలిలో వైయస్ఆర్సీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. అయితే ఆ పదవి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాబోస్ కు కేటాయించడంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును చీఫ్ విప్ గా నియమించారు. ఇకపోతే ప్రభుత్వ విప్ గా గంగుల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

మరోవైపు శాసనమ మండలిలో టీడీపీ పక్షనేతగా యనమల రామకృష్ణుడును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ షరీష్‌ అహ్మద్‌ సభలో ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu