మోడీ అఖిలపక్షానికి టీడీపీ లేఖ మాత్రమే

Published : Jun 18, 2019, 06:01 PM IST
మోడీ అఖిలపక్షానికి టీడీపీ లేఖ మాత్రమే

సారాంశం

ఈ నెల 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.  

అమరావతి: ఈ నెల 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయమై  కేంద్రం మంగళవారం నాడు అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.  
ఈ సమావేశానికి హాజరుకావాలని  కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు లేఖలను పంపింది.  అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

ఈ సమావేశంలోని ఎజెండా అంశాలపై తమ పార్టీ అభిప్రాయాలను టీడీపీ లేఖ ద్వారా  పంపనుంది.జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయమై రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ కేంద్రాన్ని కోరనుంది.
 

PREV
click me!

Recommended Stories

రికార్డ్ సృష్టించిన తెలుగు విద్యార్థిని! చంద్రుడి మిషన్‌కు ఎంపిక | AP Student with Mission ShaktiSat
ఏనుగుల బెడదకు చెక్! పవన్ కీలక నిర్ణయం | Pawan Kalyan Launches Guchchimi Elephant Camp