రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

Published : Sep 25, 2022, 01:11 PM IST
రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

సారాంశం

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.   

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం  చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఎత్తైన ర్యాంపులు మీదపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. అయితే సీఎం జగన్ పర్యటనకు మూడు రోజుల ముందు రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇక, సీఎం జగన్ ఈ నెల 28న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కల్వటాల సమీపంలో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రతి ఏడాది 2 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇక, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లును చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో హెలిప్యాడ్‌ను కంపెనీ ప్రతినిధులు సిద్దం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu