ఆచంటలో పడవ బోల్తా: ఇద్దరు యువకుల గల్లంతు

By narsimha lodeFirst Published May 23, 2023, 12:08 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా  ఆచంట వద్ద  పడవ బోల్తా పడడంతో  ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. 


ఏలూరు: పశ్చిమ గోదావరి  జిల్లా ఆచంట మండలం భీమాలపురం  వద్ద గోదావరి నదిలో మంగళవారంనాడు పడవ బోల్తా పడింది.  ఈ ఘటనలో  ఇద్దరు  యువకులు గల్లంతయ్యారు.  పడవలో  లంక నుండి  కొబ్బరి బొండాలు తీసుకువస్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. బోటులో  కొబ్బరి బొండాల బరువు  ఎక్కువగా  ఉన్న కారణంగా  పడవ  బోల్తా పడిందని  సమాచారం.  గల్లంతైన  ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

click me!