వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్: సుప్రీంలో ప్రారంభమైన విచారణ

By narsimha lodeFirst Published May 23, 2023, 11:10 AM IST
Highlights

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ పై  సుప్రీంకోర్టులో  ఇవాళ విచారణ ప్రారంభమైంది. 
 

న్యూఢిల్లీ:  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  దాఖలు  చేసిన  ముందస్తు  బెయిల్ పిటిషన్ పై  మంగళవారం నాడు సుప్రీంకోర్టు  విచారణను  ప్రారంభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఈ నెల 22న  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  సుప్రీంకోర్టు  వెకేషన్ బెంచ్  విచారణ ను ప్రారంభించింది. 

ఇప్పటికే  ముందస్తు బెయిల్ కోసం  వైఎస్ అవినాష్ రెడ్డి  పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ ను  వెకేషన్ బెంచ్   విచారించేలా  ఆదేశాలు  జారీ చేయాలని   వైఎస్ అవినాాష్ రెడ్డి  ఆ పిటిషన్ లో  కోరారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  దాఖలు  చేసిన  పిటిషన్ ను జస్టిస్  జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహంలతో  కూడిన ద్విసభ్య ధర్మాసనం  ఇవాళ విచారిస్తుంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో   సీబీఐ  నోటీసులు  జారీ చేసినా కూడా   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు  హాజరు కాలేదు. 

ఈ నెల  16, 19, 22న  విచారణకు  రావాలని సీబీఐ  అధికారులు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  నోటీసులు  ఇచ్చారు.  ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో  విచారణకు  రాలేనని  వైఎస్ అవినాష్ రెడ్డి  ఈ నెల  16న విచారణకు హాజరు కాలేదు.  అంతేకాదు  నాలుగు  రోజుల సమయం  కావాలని  సీబీఐకి లేఖ రాశారు.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి   వినతి మేరకు  ఈ నెల  19న విచారణకు  రావాలని  సీబీఐ మరోసారి నోటీసులు  ఇచ్చింది.  అయితే  సీబీఐ విచారణకు  హాజరయ్యే  సమయంలోనే  తల్లికి అనారోగ్యంగా  ఉందని సమాచారం రావడంతో   విచారణకు  హాజరు కాకుండా  వైఎస్ అవినాష్ రెడ్డి  పులివెందులకు  వెళ్లారు. 

also read:కర్నూల్ కు సీబీఐ మరో టీమ్: విశ్వభారతి ఆసుపత్రి వద్దే వైసీపీ శ్రేణులు

ఈ నెల  19వ తేదీన తల్లి  వైఎస్ శ్రీలక్ష్మిని  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో  చేర్పించారు  వైఎస్ అవినాష్ రెడ్డి . ఈ నెల  22న విచారణకు  రావాలని సీబీఐ  నోటీసులు జారీ చేసింది.   అయితే  తన తల్లి ఆరోగ్యం  మెరుగయ్యే వరకు  విచారణకు  రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐకి   లేఖ  రాశారు. అంతేకాదు  తాను  సుప్రీంకోర్టులో  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు  చేసిన విషయమై  కూడా  ఆ లేఖలో  ప్రస్తావించారు.

click me!