కారులో ఆడుకుంటుండగా.. డోర్స్ లాక్: ఇద్దరు చిన్నారులు మృతి

Siva Kodati |  
Published : Nov 17, 2020, 07:24 PM IST
కారులో ఆడుకుంటుండగా.. డోర్స్ లాక్: ఇద్దరు చిన్నారులు మృతి

సారాంశం

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏ. కొండూరు మండలం రేపూడి తండాలో కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (5), యమున (4) మరణించారు

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏ. కొండూరు మండలం రేపూడి తండాలో కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (5), యమున (4) మరణించారు.

వీరిద్దరూ కారులో ఆడుకుంటుండగా కారు డోర్స్ లాకయ్యాయి. బయటకొచ్చేందుకు పిల్లలు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ సంచలన కామెంట్స్ | Jagan Comments on Vizag Steel Plant Incident
Airport: ఈ ప్రాంతానికి మ‌హ‌ర్ధ‌శ వ‌చ్చిన‌ట్లే.. 1400 ఎక‌రాల్లో, రూ. 648 కోట్ల‌తో కొత్త‌ ఎయిర్ పోర్ట్‌