తిరుపతిలో అగ్ని ప్రమాదం.. గోవిందరాజస్వామి వారి రథానికి ప్రమాదం జరగలేదు: టీటీడీ ఈవో

Published : Jun 16, 2023, 03:08 PM IST
తిరుపతిలో అగ్ని ప్రమాదం.. గోవిందరాజస్వామి వారి రథానికి ప్రమాదం జరగలేదు: టీటీడీ ఈవో

సారాంశం

తిరుపతి‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ ఫొటో ఫ్రేమ్ వర్క్ షాప్‌లో మంటలు చెలరేగాయి.

తిరుపతి‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ ఫొటో ఫ్రేమ్ వర్క్ షాప్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో గోవిందరాజస్వామి వారి  రథానికి ఏ ప్రమాదం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాద స్థలానికి దూరంలోనే రథం ఉందని చెప్పారు. రథానికి ఎలాంటి మంటలు అంటుకోలేదని.. ముందు జాగ్రత్తగా కాస్త వెనక్కి లాగి పెట్టామని తెలిపారు. అగ్ని ప్రమాదంలో గోవిందరాజస్వామివారి రథం దెబ్బతిన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని  కోరారు. 

ఇక, ప్రమాద స్థలంపై స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ.. మంటల్లో చలికాచుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయ రథం కాలిపోయిందని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అగ్ని ప్రమాద ఘటనపై టీడీపీ దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు. 

ఇదిలా ఉంటే, గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ ఫొటో ఫ్రేమ్ వర్క్ షాప్‌లో శుక్రవారం భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న పలువురు భయంతో పరుగులు తీశారు. ఇరుకుగా ఉంటే ప్రాంతం కావడంతో.. సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్