విషాదం.. పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతుపై ఏనుగు దాడి.. కాలితో తొక్కడంతో మృతి

Published : Aug 20, 2023, 06:39 AM IST
విషాదం.. పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతుపై ఏనుగు దాడి.. కాలితో తొక్కడంతో మృతి

సారాంశం

ఓ ఏనుగు రైతు పట్ల దారుణంగా ప్రవర్తించింది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆయనపై తీవ్రంగా దాడి చేసింది. కాలితో తొక్కింది. దీంతో ఆ రైతు తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.

ఆ భార్యాభర్తలిద్దరూ పొలంలో పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో దారిలో ఉన్న ఓ ఏనుగు హఠాత్తుగా వారి మీదకి దూసుకొచ్చింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే ఇద్దరిపై దాడికి దిగింది. భార్య ఎలాగోలా తప్పించుకొని ఊర్లోకి వెళ్లింది. అందరికీ విషయం చెప్పింది. కానీ వారందరూ తిరిగొచ్చేసరికే ఆయన చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. 

మనీలాండరింగ్ కేసు: ఈ నెల 24న హాజరుకావాలని హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు

వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లె గ్రామంలో మార్కొండయ్య(52)-అరుణమ్మ అనే రైతు దంపతులు నివసిస్తున్నారు. సొంత గ్రామంలోనే వారిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా ఎప్పటిలాగే పొలానికి వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బాటకు సమీపంలో ఓ ఏనుగు నిలబడి ఉంది.

త్వరలో ఉల్లి ధరలు పెరిగే ఛాన్స్.. కేంద్రం కీలక నిర్ణయం , ఎగుమతులపై భారీగా సుంకం

దీనిని చూసుకోకుండా ఆ రైతులిద్దరూ దాని దగ్గరగా వెళ్లారు. ఆ జగరాజు ఎందుకు ఆగ్రహంగా ఉందో తెలియదు గానీ.. హఠాత్తుగా వారిపై దాడికి దిగింది. ఈ క్రమంలో భర్త మార్కొండయ్య కిందపడిపోయాడు. దీంతో ఆ ఏనుగు ఆయనను కాలితో తొక్కడం ప్రారంభించింది. అరుణమ్మ ఆ ఏనుగు బారి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు ఏనుగుదాడి విషయం చెప్పింది. దీంతో వారు కూడా వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు అక్కడికి చేరుకునేలోపే మార్కొండయ్య గాయాలతో చనిపోయారు. 

లడఖ్‌లో లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు దుర్మరణం

ఏనుగుదాడి విషయాన్ని గ్రామస్తులు ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేశారు. కాగా.. పెద్దపంజాణి మండలంలో ఇటీవల కాలంలో ఏనుగు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ముగ్గురు రైతులు చనిపోయారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
బొజ్జల సుధీర్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Bojjala Sudheer Reddy Powerful Speech | Asianet Telugu