అనంతపురం ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

Published : Aug 18, 2022, 05:18 PM IST
అనంతపురం ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

సారాంశం

అనంతపురం జిల్లాలోని అలమూరులోని ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. 

 అనంతపురం: అనంతపురంలో ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పదస్థితిలో మరణించారు. తొలుత ఈ ముగ్గురు యువకులు ద్రాక్షతోటలో అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురు కూడా మహారాష్ట్రకు చెందిన యువకులని స్థానికులు చెప్పారు.
అయితే ఈ ముగ్గురు మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పదస్థితిలో ఈ ముగ్గురు పడి ఉండడానికి కారణాలు తెలియాల్సి ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ తెలిపింది.ఈ ముగ్గురి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. 

 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu