చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

Published : Feb 26, 2023, 09:20 AM ISTUpdated : Feb 26, 2023, 09:23 AM IST
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

సారాంశం

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జరిగింది. గుడుపల్లె మండలంలోని చిన్నశెట్టిపల్లిలో లారీ- కారు ఢీకొన్నాయి. 

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జరిగింది. గుడుపల్లె మండలంలోని చిన్నశెట్టిపల్లిలో లారీ- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై సమాచారం  అందుకున్న పోలీసులు.. అక్కడికి  చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను వికాస్, కల్యాణ్, ప్రవీణ్‌లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు పీఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..