తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు... అమ్మాయిని ఎరగావేసి..

Published : Sep 04, 2019, 09:17 AM IST
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు... అమ్మాయిని ఎరగావేసి..

సారాంశం

ఇటీవల ఓ యువకుడికి అమ్మాయిని ఎరగా వేసి  నిలువు దోపిడి చేశారు. నగదు, వస్తువులతో పాటు ఒంటిపై దుస్తులను దొంగలు దోచుకెళ్లారు. వారం క్రితం ఇలాంటి ముఠానే తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుపతిలో  దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్వామివారి దర్శానికి వచ్చే భక్తులను దోచుకుంటున్నారు. నిలువు దోపిడీ చేసి గానీ వదలడం లేదు. తాజాగా.. ఓ యువకుడిని నిలువు దోపిడీ చేశారు. బాధితుడు ఫిర్యాదుతో ఈ దోపిడీ దొంగల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ఓ యువకుడికి అమ్మాయిని ఎరగా వేసి  నిలువు దోపిడి చేశారు. నగదు, వస్తువులతో పాటు ఒంటిపై దుస్తులను దొంగలు దోచుకెళ్లారు. వారం క్రితం ఇలాంటి ముఠానే తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలను ఎరవేస్తూ... ఈ ముఠాలు దోపిడీలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఓ ముఠాను అరెస్టు చేయగా.. మరో ముఠా దోపిడీలు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని వారు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

నారా లోకేష్ గారి కృషితో ఆర్డీటీ సేవలు పునరుద్దరణ : మంత్రి సవిత| Asianet News Telugu
TB Free India: కేవలం 2 నిమిషాల్లో టీబీ గుర్తింపు.. ఏపీలో కొత్త టెక్నాలజీ షురూ !