విజయవాడ చేపల మార్కెట్‌లో చోరీ కలకలం.. మొబైల్ ఫోన్లు, పర్సులు మాయం

Published : Nov 07, 2021, 03:11 PM IST
విజయవాడ చేపల మార్కెట్‌లో చోరీ కలకలం.. మొబైల్ ఫోన్లు, పర్సులు మాయం

సారాంశం

విజయవాడ చేపల మార్కెట్‌లో చోరీ కలకలం రేపింది. చేపల మార్కెట్‌లో మొబైల్ ఫోన్లు, పర్సులను ఓ వ్యక్తి దొంగిలించాడు. నిందితుడిని వ్యాపారులు పట్టుకున్నారు. కానీ, నిందితుడు వెంట పట్టుకు వచ్చిన ఏడాదిన్నర బాలికను వదిలి పరారయ్యాడు.   

అమరావతి: విజయవాడలో చోరీ కలకలం రేపింది. Vijayawada బీసెంట్ రోడ్డు చేపల మార్కెట్లో ఓ దొంగ చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డాడు. Fish Marketలో మొబైల్ ఫోన్లు, పర్సులు చోరీ చేశాడు. ఏడాదిన్నర బాలికను వెంటబెట్టుకుని ఆ దొంగ చేపల మార్కెట్‌కు వచ్చాడు. మార్కెట్‌లో పలువురి Mobile Phones, Purseలను దొంగిలించాడు. ఈ వ్యవహారంపై వ్యాపారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని వారే గుర్తించి పట్టుకున్నారు. 

ఆ నిందితుడిని వ్యాపారస్తులు పట్టుకున్నారు కానీ, తర్వాత ఆ ఏడాదిన్నర చిన్నారిని అక్కడే వదిలి పెట్టి పరారయ్యాడు. ఇప్పుడు ఆ ఏడాదిన్నర బాలిక వ్యాపారుల ఆశ్రయంలోనే ఉన్నది. ఆ బాలిక నిందితుడి కూతురా? లేక ఆమెనూ కిడ్నాప్ చేసుకుని పట్టుకు వచ్చాడా? అనే కోణంలో అనుమానిస్తున్నారు. ఈ చోరీపై వ్యాపారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Also Read: హైద్రాబాద్‌లో రూ.3.25 లక్షలు చోరీ, డబ్బులను టాయిలె‌లో వేశాడు: పోలీసులకు చిక్కాడిలా...

హైదరాబాద్‌లో ఇటీవలే దొంగతనం జరిగింది  జూబ్లీ హిల్స్‌లోని వస్త్ర వ్యాపారి దీపావళి పూజ నిర్వహిస్తున్న సందర్భంలో ఇంట్లో పనికి వచ్చిన ఓ వ్యక్తి లక్షల రూపాయలన కొట్టేశాడు. చివరికి దొరికిపోతాననే భయంతో వాష్ రూమ్ వెళ్లి బాత్‌రూమ్ కమోడ్‌లో వేసి ఫ్లష్ చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu