చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ నేత భేటీ

Published : Feb 19, 2019, 04:24 PM IST
చంద్రబాబుతో  తెలంగాణ కాంగ్రెస్ నేత భేటీ

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ రాజధాని  అమరావతిలో వీరిద్దరూ భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.

భేటీ అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో తాను జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును.. ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్టీలన్నీ ఏకమౌతున్నాయమని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu