లావణ్య పై దాడి : 20నెలల పాలనలో 350 అత్యాచారాలు.. సిగ్గు సిగ్గు.. వంగలపూడి అనిత

Published : Jan 22, 2021, 04:53 PM IST
లావణ్య పై దాడి : 20నెలల పాలనలో 350 అత్యాచారాలు.. సిగ్గు సిగ్గు.. వంగలపూడి అనిత

సారాంశం

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి లావణ్యపై దాడి ఘటనే ఉదాహరణ అంటూ తెలుగు దేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. 

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి లావణ్యపై దాడి ఘటనే ఉదాహరణ అంటూ తెలుగు దేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. 

కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్యపై సునీల్ అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడాన్ని ఆమె ఖండించారు. జగన్ 20 నెలల పాలనలో 350 మంది  మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయని ఎద్దేవా చేశారు.

దిశ దశ లేని చట్టం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మద దాడులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఓ మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే రోజు రోజుకు మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటున్నా అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. 

కడపజిల్లా పొద్దుటూరులో లావణ్య అనే యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తూ.. ఈ రోజు కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu