టిడిపిలో విషాదం... కరోనాతో జాతీయ ఉపాధ్యక్షురాలు కన్నుమూత

Arun Kumar P   | stockphoto
Published : Nov 20, 2020, 07:31 AM ISTUpdated : Nov 20, 2020, 07:34 AM IST
టిడిపిలో విషాదం... కరోనాతో జాతీయ ఉపాధ్యక్షురాలు కన్నుమూత

సారాంశం

 గత నెలలో కరోనా బారినపడ్డ టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలు సత్యప్రభ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు. 

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ(70) మరణించారు. గత నెలలో కరోనా బారినపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ, రెండు సార్లు టిటిడి ఛైర్మన్ గా రెండుసార్లు పనిచేసిన దివంగత ఆదేకేశవులు భార్యే సత్యప్రభ.  2009లో ఆదికేశవులు అనారోగ్యంతో మృతిచెందాక ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లో టిడిపి తరపున పోటీచేసి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమె తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 

అయితే ఇటీవల కరోనాబారిన పడ్డ ఆమె బెంగళూరులోని వైదేహీ హాస్పిటల్ చేరి చికిత్స పొందారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ నెల 3వ తేదీ నుండి మరింత క్షీణించడంతో ఐసియూలో వెంటిలేటర్ పై వుంచారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆమె కన్నూమూశారు. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu