మాకొద్దు మహా ప్రభో అంటుంటే.. బలవంతమెందుకు: జగన్‌పై లోకేశ్ ఫైర్

Siva Kodati |  
Published : Sep 20, 2020, 05:06 PM IST
మాకొద్దు మహా ప్రభో అంటుంటే.. బలవంతమెందుకు: జగన్‌పై లోకేశ్ ఫైర్

సారాంశం

రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దు అంటున్నా జగన్ రెడ్డి గారు బలవంతంగా మీటర్ల మోత పెడుతున్నారని మండిపడ్డారు

రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దు అంటున్నా జగన్ రెడ్డి గారు బలవంతంగా మీటర్ల మోత పెడుతున్నారని మండిపడ్డారు.

ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు మీటర్లు పెట్టడానికి మాత్రం అంగీకరించేది లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని లోకేశ్ గుర్తుచేశారు.

ఓ పక్క నిరసనలు జరుగుతున్నా.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణమని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ ఎద్దేవా చేశారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

రాజ్యసభలో రేణుకా చౌదరి Vs ఉప రాష్ట్రపతి | Andhra Pradesh Capital | Amaravati | Asianet News Telugu
అమరావతి పేరుతో కుంభకోణాలు.. అందుకేవ్యతిరేకిస్తున్నాం | YSRCP MP YV Subbareddy | Asianet News Telugu