టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం..

Published : Jun 13, 2022, 11:39 AM ISTUpdated : Jun 13, 2022, 12:06 PM IST
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం..

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి  జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా అసుమర్లపూడిలో చోటుచేసుకుంది.   

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి  జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వివరాలు.. గుంటూరు జిల్లా అసుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు, మట్టి మాఫియా అడ్డుకుంది. టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. దూళిపాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే  స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర.. అక్రమాలను ప్రశ్నిస్తే ‘‘మీకేందుకు భయం’’ అని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

dhulipalla narendra ఘనంగా ధూళిపాళ్ల కుమార్తె వివాహం హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎం లు | Asianet Telugu
కుప్పంలో మెగా జాబ్ మేళాలో పాల్గొన్న నారా భువనేశ్వరి| Asianet News Telugu