కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం...ఆలపాటి నిరాహారదీక్ష

Arun Kumar P   | Asianet News
Published : Apr 15, 2020, 11:47 AM IST
కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం...ఆలపాటి నిరాహారదీక్ష

సారాంశం

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ 12గంటల నిరాహారదీక్షకు దిగారు. 

గుంటూరు: కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాతపడిన వారి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఇలా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బుధవారం ఉదయం 8 గంటల నుండి తన కార్యాలయంలో ఆలపాటి నిరాహార దీక్షుకు దిగారు. సాయంత్రం 8 గంటల వరకు అంటే మొత్తంగా 12గంటలు నిరాహారదీక్షలోనే వుండనున్నారు. ఆయనతో పాటు స్థానిక టిడిపి నాయకులు పిల్లి మాణిక్యరావు, కోవెలమూడి  రవీంద్ర నాని  దీక్షలో కూర్చున్నారు. 
 
వైసిపి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లివే: 

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. 

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి కరోనా సహాయం నిమిత్తం రూ.5000  ఇవ్వాలి. 

కరోనా వైరస్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu