వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. అనర్హత వేయండి : స్పీకర్‌కు తెలుగుదేశం ఫిర్యాదు

Siva Kodati |  
Published : Jan 12, 2024, 08:50 PM ISTUpdated : Jan 12, 2024, 08:55 PM IST
వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. అనర్హత వేయండి : స్పీకర్‌కు తెలుగుదేశం ఫిర్యాదు

సారాంశం

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ .. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ .. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్‌లపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి పిటిషన్ ఇచ్చారు టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష విప్ బాలవీరాంజనేయస్వామి పేరుతో పిటిషన్ అందజేశారు. ఇప్పటికే వైసీపీలో గెలిచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అదే బాటలో టీడీపీ కూడా నడుస్తూ వుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మరి ఈ రెండు పిటిషన్‌లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్