కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి అరెస్ట్... చంద్రబాబు ఆగ్రహం

Published : Jan 29, 2021, 04:22 PM ISTUpdated : Jan 29, 2021, 04:31 PM IST
కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి అరెస్ట్... చంద్రబాబు  ఆగ్రహం

సారాంశం

వ్యాపారులు వద్దని బతిమాలినా వినకుండా కూరగాయల మార్కెట్ కూల్చివేత వైసిపి మరో తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

పొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, కడప పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  పొద్దుటూరు మార్కెట్ కూల్చివేత ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని... అలాగే అరెస్ట్ చేసిన లింగారెడ్డి సహా టిడిపి మరియు ఇతర ప్రతిపక్షాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
 
వ్యాపారులు వద్దని బతిమాలినా వినకుండా కూరగాయల మార్కెట్ కూల్చివేత వైసిపి మరో తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముస్లిం, బిసి, ఎస్సీ, ఎస్టీలు నడుపుకునే షాపులను కూల్చడాన్ని ఖండిస్తున్నానన్నారు. నిర్మించడం చేతగాని వైసిపికి కూల్చేసే హక్కు ఎక్కడిది..? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

''ప్రజావేదికతో ప్రారంభమైన వైసిపి విధ్వంసకాండ ప్రతి నియోజకవర్గంలోనూ చేస్తున్నారు. చిరువ్యాపారుల పొట్టకొట్టే చర్యలకు వైసిపి స్వస్తి చెప్పాలి. కమిషన్ల కక్కుర్తితో వ్యాపారులను వేధించడం దారుణం. ఇలాంటి చర్యలను వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మానుకోవాలి'' అని చంద్రబాబు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu