కుప్పం: చంద్రబాబు పీఏ సహా 19 మంది టీడీపీ నేతల అరెస్ట్

Siva Kodati |  
Published : Apr 08, 2021, 09:14 PM ISTUpdated : Apr 08, 2021, 09:15 PM IST
కుప్పం: చంద్రబాబు పీఏ సహా 19 మంది టీడీపీ నేతల అరెస్ట్

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మనోహర్‌తో పాటు పలువురు టీడీపీ నేతలను కుప్పం పోలీసులు అరెస్ట్‌ చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మనోహర్‌తో పాటు పలువురు టీడీపీ నేతలను కుప్పం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.

దీనిలో భాగంగా ఈ కేసుతో సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారంటూ సీఐ కార్యాలయం వద్ద చంద్రబాబు పీఏ మనోహర్‌ సహా పలువురు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో మనోహర్‌తో పాటు మరో 19 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది,
 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu