ఏపీ హైకోర్ట్‌: కోస్తా, రాయలసీమ లాయర్ల మధ్య తోపులాట... ఒకరికి గాయాలు

Siva Kodati |  
Published : Apr 08, 2021, 06:57 PM ISTUpdated : Apr 08, 2021, 06:59 PM IST
ఏపీ హైకోర్ట్‌: కోస్తా, రాయలసీమ లాయర్ల మధ్య తోపులాట... ఒకరికి గాయాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ, కోస్తా న్యాయవాదుల మధ్య వివాదం తలెత్తింది

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయలసీమ, కోస్తా న్యాయవాదుల మధ్య వివాదం తలెత్తింది. మీటింగ్ నిర్వహించే విషయమై ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.  

ఈ క్రమంలో బార్‌ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్ తలపై కుర్చీ తగలడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. జరిగిన ఘటనపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు వివరించాలని గాయపడిన న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.   
 

PREV
click me!

Recommended Stories

ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage