ఎద్దులుగా కూతుళ్లు... చిత్తూరు రైతుకు ట్రాక్టర్ : సోనూసూద్‌ సాయంపై చంద్రబాబు ప్రశంసలు

Siva Kodati |  
Published : Jul 26, 2020, 09:45 PM ISTUpdated : Jul 27, 2020, 04:16 PM IST
ఎద్దులుగా కూతుళ్లు... చిత్తూరు రైతుకు ట్రాక్టర్ : సోనూసూద్‌ సాయంపై చంద్రబాబు ప్రశంసలు

సారాంశం

చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఇద్దరు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నతున్న వీడియో వైరల్ అయ్యింది.

చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఇద్దరు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నతున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం బాలీవుడ్ నటుడు సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు.

దీంతో సోనూసూద్ వెంటనే స్పందించి.. వారికి ముందుగా రెండు  ఎద్దులు అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. తర్వాత కొద్దిసేపటికి వారి కష్టాలు తీరటానికి ఎద్దులు సరిపోవటంతో ఓ ట్రాక్టర్‌ను వారికి అందిస్తున్నట్లుగా ప్రకటించాడు.

Also Read:చిత్తూరు అక్కా చెల్లెళ్లకు సోనూ సూద్‌ సాయం... ఆ చేతికి ఎముకే లేదు!

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. అనేక మంది సోనూసూద్‌ను అభినందిస్తున్నారు. ఈ లిస్టులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరారు.

ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని అభినందించిన చంద్రబాబు సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. దళిత రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu