ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడ్డ డీకే శివకుమార్, చంద్రబాబు.. పక్కకెళ్లి సీక్రెట్‌గా మంతనాలు

Siva Kodati |  
Published : Dec 28, 2023, 08:38 PM ISTUpdated : Dec 29, 2023, 09:07 AM IST
ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడ్డ డీకే శివకుమార్, చంద్రబాబు.. పక్కకెళ్లి సీక్రెట్‌గా మంతనాలు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో , కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో , కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన చంద్రబాబు తిరిగి కుప్పంకు బయల్దేరేందుకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో డీకే శివకుమార్ కూడా ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గాను ప్రత్యేక విమానం వద్దకు వచ్చారు. దీంతో ఇద్దరు నేతలు ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇద్దరూ తమ భద్రతా సిబ్బందిని దూరంగా వుంచి కాస్త పక్కకి వెళ్లి సీక్రెట్‌గా మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత కలిగిస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu