అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు:నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్ధి రంగయ్య

Published : Feb 23, 2023, 04:29 PM ISTUpdated : Feb 23, 2023, 04:56 PM IST
 అనంతపురం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికలు:నామినేషన్  దాఖలు  చేసిన  టీడీపీ అభ్యర్ధి రంగయ్య

సారాంశం

అనంతపురం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  స్థానానికి  టీడీపీ  అభ్యర్ధి  రంగయ్య  గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు.


అనంతపురం: అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  స్థానంలో  టీడీపీ పోటీకి దిగింది.  టీడీపీ అభ్యర్దిగా  వై. రంగయ్య  గురువారం నాడు నామినేషన్ దాఖలు  చేశారు.  రంగయ్య  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు.   అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  టీడీపీ  నామినేషన్ దాఖలు  చేయడం  రాజకీయంగా  చర్చకు దారి తీసింది.   అనంతపురం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా మంగమ్మ నామినేషన్ దాఖలు  చేశారు.   స్తానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల నామినేషన్ దాఖలుకు  ఇవాళ  చివరి తేది.   కావడంతో టీడీపీ అభ్యర్ధి  రంగయ్య  ఇవాళ  నామినేషన్ వేశారు. అనంతపురంలో  టీడీపీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు  చేయడంపై  వైసీపీ నేతలు మండిపడ్డారు. 
;

PREV
click me!

Recommended Stories

భార్యతో కలిసి రోడ్డు పక్కన తాటి ముంజలు తిన్న చంద్రబాబు | Chandrababu | Ice Apples
అక్క VS తమ్ముడు | Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet News Telugu