స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని కోడెల ఇంటికి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని కోడెల ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.