మోదీ ఫోటోకి బదులు చంద్రబాబు ఫోటో పెట్టుకుంటున్నారు.. సోమువీర్రాజు

Published : Aug 09, 2018, 02:44 PM IST
మోదీ ఫోటోకి బదులు చంద్రబాబు ఫోటో పెట్టుకుంటున్నారు.. సోమువీర్రాజు

సారాంశం

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా.. చంద్రబాబు, లోకేష్ ఫొటోలే పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. 

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఏపీసీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. స్వచ్ఛ భారత్ ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా.. చంద్రబాబు, లోకేష్ ఫొటోలే పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిపై తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికధరలకు విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రంపై రూ. 20వేల కోట్ల భారం పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో విద్యుత్‌ కొనుగోళ్లపై కోర్టుకెళ్తామని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?