విశాఖ కూర్మన్నపాలెంలో భూమి కబ్జాకు యత్నం .. ఒకేసారి 200 మంది దాడి (వీడియో)

Siva Kodati |  
Published : Oct 10, 2023, 08:42 PM ISTUpdated : Oct 10, 2023, 08:49 PM IST
విశాఖ కూర్మన్నపాలెంలో భూమి కబ్జాకు యత్నం .. ఒకేసారి 200 మంది దాడి (వీడియో)

సారాంశం

విశాఖపట్నం కూర్మన్నపాలెం రెవిన్యూ సర్వే నెంబరు 39/1C సుమారులో రూ.10 కోట్లు విలువచేసే ఎకరా 9 సెంట్లు స్థలం కబ్జాకు స్కెచ్ చేసేందుకు మంగళవారం రౌడీ మూకలు యత్నించాయి.

విశాఖపట్నంలో విలువైన భూమిపై కొందరి కళ్లు పడ్డాయి. దీంతో దానిని ఆక్రమించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కూర్మన్నపాలెం రెవిన్యూ సర్వే నెంబరు 39/1C సుమారులో రూ.10 కోట్లు విలువచేసే ఎకరా 9 సెంట్లు స్థలం కబ్జాకు స్కెచ్ చేసేందుకు మంగళవారం రౌడీ మూకలు యత్నించాయి. కొన్ని సంవత్సరాలు నుండి రెండు పార్టీలు పార్టీల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం దాదాపు 200 మంది రౌడీలు వచ్చి స్థలంలో ఫెన్సింగ్ మాదిరిగా వేసిన ఐరన్ రేకులను తొలగించి విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు రంగంలోకి దిగి రౌడీ మూకలను చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Chandrababu Naidu With Bhuvaneshwari at Raj Bhavan ‘At Home’ Event | Asianet News Telugu
‘స్త్రీ శక్తి' లబ్ధిదారులతో సామాన్యుడిలా టికెట్ తీసుకుని ప్రయాణించిన సీఎం | Stree Shakti Scheme