పెళ్లయిన నాలుగు రోజులకే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు వధువును వదిలేసి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. నవ వధువును వదిలి వరుడు పారిపోయాడు. కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలో ఈ సంఘటన జరిగింది.
కోయిలకుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరకుమార్ వివాహమైన నాలుగు రోజులకే నవ వధువును వదిలి ఇంట్లోంచి పారిపోయాడు. దీంతో వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
వరుడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ప్రేమ వ్యవహారమే అతను పారిపోవడానికి కారణమని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. కోయిలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.