విచిత్రం : బ్యాలెట్ బాక్సుల్లో.. నంద్యాల తాగుబోతుల విన్నపం..

By AN TeluguFirst Published Mar 15, 2021, 11:08 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యపరిచాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో ఈ చీటీలు ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యపరిచాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో ఈ చీటీలు ఉన్నాయి. 

వీటిల్లో మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లైన సుప్రీం, దారు, హైదరాబాద్, జంబోలను తొలగించాలని, వాటి స్తానంలో పాత బ్రాండ్లైన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ రకాలు అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నపం ఉంది.

ఈ మేరకు  తెల్లకాగితం మీద ముంద్రించిన చీటీలు లభ్యమయ్యాయి. పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందని హెచ్చరిక కూడా అందులో ఉంది. 

click me!