విచిత్రం : బ్యాలెట్ బాక్సుల్లో.. నంద్యాల తాగుబోతుల విన్నపం..

Published : Mar 15, 2021, 11:08 AM IST
విచిత్రం : బ్యాలెట్ బాక్సుల్లో.. నంద్యాల తాగుబోతుల విన్నపం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యపరిచాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో ఈ చీటీలు ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యపరిచాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో ఈ చీటీలు ఉన్నాయి. 

వీటిల్లో మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లైన సుప్రీం, దారు, హైదరాబాద్, జంబోలను తొలగించాలని, వాటి స్తానంలో పాత బ్రాండ్లైన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ రకాలు అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నపం ఉంది.

ఈ మేరకు  తెల్లకాగితం మీద ముంద్రించిన చీటీలు లభ్యమయ్యాయి. పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందని హెచ్చరిక కూడా అందులో ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu