విషాదం.. రూ.2 కోసం ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

Published : Nov 01, 2023, 12:44 PM IST
విషాదం.. రూ.2 కోసం ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

సారాంశం

పాకెట్ మనీ అడిగితే తల్లి ఇవ్వలేదని ఓ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కనగానపల్లిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రూ.2 కోసం ఓ ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్కూలుకు వెడుతూ తల్లిని పాకెట్ మనీ రూ.2 ఇవ్వమని అడిగాడు. దీనికి తల్లి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఇంట్లోనుంచి డబ్బులు తీసుకుని వచ్చిన తల్లి అది చూసి షాక్ అయ్యింది. డబ్బులు తీసుకుని వచ్చేలోపే కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని హృదయవిదారకంగా రోదిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?