అమలాపురంలో 20 మంది స్కూల్ విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Published : Mar 13, 2023, 02:35 PM IST
అమలాపురంలో 20 మంది స్కూల్ విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

సారాంశం

అంబేడ్కర్ కొనసీమ జిల్లా అమలాపురం బండారు లంక‌లోని ఓ స్కూల్‌లో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అంబేడ్కర్ కొనసీమ జిల్లా అమలాపురం బండారు లంక‌లోని ఓ స్కూల్‌లో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. పాఠశాలకు సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పుపెట్టడంతో.. వెలువడిన పొగతో ఊపిరాడక విద్యార్థులు ఉక్కిరిబిక్కరి అయ్యారు. స్పృహ తప్పిన విద్యార్థులను వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చేరుకుని తమ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఇక, ప్రస్తుతం విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. 

PREV
click me!

Recommended Stories

సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
Heavy Rain Alert : తీవ్ర వాయుగుండం దెబ్బకు ఈ మూడ్రోజుల్లో 100-120 మి.మీ వర్షం కురుస్తుందా..! ఈ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్