గుంటూరు జిల్లాలో స్కూలు బస్సు బోల్తా, బస్సులో 50 మంది చిన్నారులు

By sivanagaprasad KodatiFirst Published Jan 28, 2019, 10:38 AM IST
Highlights

గుంటూరు జిల్లాలో స్కూలు పిల్లలతో వెళ్తున్న బస్సు కల్వర్టు నుంచి బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే... వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద 60 మంది పిల్లలతో వెళ్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూలుకు చెందిన బస్సు కల్వర్టుపై నుంచి బోల్తాపడింది. 

గుంటూరు జిల్లాలో స్కూలు పిల్లలతో వెళ్తున్న బస్సు కల్వర్టు నుంచి బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే... వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద 60 మంది పిల్లలతో వెళ్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూలుకు చెందిన బస్సు కల్వర్టుపై నుంచి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన చిన్నారులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్కూలు బస్సు ప్రమాదంపై విద్యార్థుల తల్లీదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. 

Andhra Pradesh: 15 students suffer minor injuries and 2 students suffer serious injuries, after a school bus turned turtle in Guntur district. Students shifted to a nearby hospital. Driver of the school bus is being questioned by the police. pic.twitter.com/SCSIntc7P5

— ANI (@ANI)
click me!