పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరండి: స్వరూపనందపై యామిని ఫైర్

Published : Feb 18, 2019, 03:22 PM ISTUpdated : Feb 18, 2019, 03:24 PM IST
పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరండి: స్వరూపనందపై యామిని ఫైర్

సారాంశం

ఒక పీఠాధిపతిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని స్పష్టం చేశారు. 

అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పీఠాధిపతిగా ఉంటూ రాజకీయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

రాజకీయాలు చెయ్యాలంటే పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరాలంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబుపై కేసు వేస్తానని స్వరూపానందస్వామి అనడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఒక పీఠాధిపతిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Press Meet: వేట్లపాలెం మృ*తుల కుటుంబాలకు 20లక్షలు ఆర్థిక సాయం | Asianet News Telugu
CM Chandrababu Naidu:వేట్లపాలెం ప్రమాద ఘటనపై అధికారులని సస్పెండ్ చేసిన సీఎం| Asianet News Telugu