బాబు నివాసం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ పై నుంచి ఎగిరిపడి వ్యక్తి మృతి

Published : Mar 23, 2019, 10:28 PM ISTUpdated : Mar 23, 2019, 10:30 PM IST
బాబు నివాసం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ పై నుంచి ఎగిరిపడి వ్యక్తి మృతి

సారాంశం

ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోని కరకట్టపై బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. 

ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. 

బొలెరో వాహనంలో ఉన్నవారు క్షేమంగానే బయటపడ్డారు. వారికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu