వైఎస్ వివేకా హత్య : నిందితుల రిమాండ్ పొడిగింపు

Published : Apr 08, 2019, 02:33 PM IST
వైఎస్ వివేకా హత్య :  నిందితుల రిమాండ్ పొడిగింపు

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీ వరకు పులివెందుల కోర్టు రిమాండ్ పొడిగించింది.  

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీ వరకు పులివెందుల కోర్టు రిమాండ్ పొడిగించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఈ ఏడాది మార్చి 14వ తేదీ రాత్రి  హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఉద్దేశ్యంతో వివేకానందరెడ్డి సన్నిహితుడు గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి కొడుకు ప్రకాష్‌లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులు జైల్లో ఉన్నారు.

ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం నాడు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు 
ఈ  నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే