లేఖాస్త్రాలు : ఇంగ్లీషులో బోధన మీద జగన్ కు రఘురామ మరో లేఖ...

Published : Jul 03, 2021, 09:29 AM IST
లేఖాస్త్రాలు : ఇంగ్లీషులో బోధన మీద జగన్ కు రఘురామ మరో లేఖ...

సారాంశం

ఏపీ సీఎం జగన్ కు ఆంగ్ల మాధ్యమంలో బోధనమీద ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటోందన్నారు. పాఠశాలల్లో అవసరమైన యంత్రాంగం ఉందో, లేదో ఆలోచించారా? అని రఘురామ ప్రశ్నించారు.   

ఏపీ సీఎం జగన్ కు ఆంగ్ల మాధ్యమంలో బోధనమీద ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటోందన్నారు. పాఠశాలల్లో అవసరమైన యంత్రాంగం ఉందో, లేదో ఆలోచించారా? అని రఘురామ ప్రశ్నించారు. 

ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలుగును కనీసం ద్వితీయ భాషగా పెడుతున్నట్లు కూడా స్పష్టం చేయలేదన్నారు. మీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమనే చాలామంది వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోవాలన్నారు. పసి మనసులను మాతృభాష నుంచి దూరం చేయకండన్నారు.

ఇప్పటికైనా తెలుగు భాషను చిదిమేయాలనే మంకుపట్టుతో వేసిన.. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని రఘురామ కోరారు. జాతీయ విద్యా విధానాన్ని తూచా తప్పకుండా అనుసరించి.. మీ గౌరవం, రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని లేఖలో ఎంపీ రఘురామ కోరారు. 

PREV
click me!

Recommended Stories

Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?