వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి

Published : Jul 12, 2019, 12:12 PM IST
వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి  నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి  నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో  ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్  విచారిస్తున్నారు. ఈ కేసులో  సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో  నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు పోలీసులకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది.

శుక్రవారం రాత్రి పులివెందుల పోలీసులు  గంగిరెడ్డిని  హైద్రాబాద్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే  ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ పరీక్షలకు కోర్టు అనుమతిని ఇచ్చింది.

వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్  రంగయ్య, ఈ కేసులో అనుమానితుడు శేఖర్ రెడ్డిలకు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి  కూడ నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో  నార్కో టెస్ట్‌కు అనుమతి ఇచ్చిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకొంది.

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu