వైసీపీ కౌన్సిలర్ల ఇళ్ళలో పోలీసు సోదాలు

Published : Jul 30, 2017, 05:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
వైసీపీ కౌన్సిలర్ల ఇళ్ళలో పోలీసు సోదాలు

సారాంశం

నంద్యాలలోని ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేయటం పట్టణంలో కలకలం రేగింది. గతంలో కూడా కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే కదా?

తెలుగుదేశంపార్టీ బరితెగించింది. నోటిఫికేషన్ విడుదలైన రోజే ప్రతిపక్ష నేతల ఇళ్ళపై పోలీసులను టిడిపి ఉసిగొల్పుతోంది. నంద్యాలలోని ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేయటం పట్టణంలో కలకలం రేగింది. గతంలో కూడా కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే కదా? ఇపుడు 21వ వార్డు కౌన్సిలర్ అనిల్ రాజ్ ఇంటిపై పోలీసులు దాడులు చేసారు. ఎన్నికల్లో పంచటానికి డబ్బులు దాచిపెట్టారని ఫిర్యాదులు వచ్చాయంటూ ఇల్లంతా సోదాలు చేయటం పట్టణంలో చర్చ మొదలైంది. అదే విధంగా 22వ వార్డు కౌన్సిలర్ మురళి ఇంటిపై కూడా పోలీసుల దాడిపై పట్టణంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే, వీరిద్దరు దళితులే. అంటే బిసిలు, దళితులను లక్ష్యంగా చేసుకుని టిడిపి దాడులు చేస్తోందంటూ ప్రచారం ఊపందుకున్నది.

 

 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu