ముంబై కేంద్రంగా సైబర్ నేరాలు: విశాఖ వాసి శ్రీనివాస్ అరెస్ట్

Published : May 03, 2023, 09:56 AM IST
ముంబై  కేంద్రంగా  సైబర్ నేరాలు: విశాఖ వాసి  శ్రీనివాస్ అరెస్ట్

సారాంశం

రోజు రోజుకి  సైబర్ నేరాలు  పెరిగిపోతూనే  ఉన్నాయి.  ముంబై  కేంద్రంగా  సైబర్ నేరాలకు పాల్పడుతున్న విశాఖపట్టణానికి చెందిన  శ్రీనివాస్ అనే వ్యక్తిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

ముంబై:  ముంబై కేంద్రంగా  సైబర్ నేరాలకు  పాల్పడుతున్న  విశాఖపట్టణానికి చెందిన  శ్రీనివాస్ ను  పోలీసులు  బుధవారంనాడు  అరెస్ట్  చేశారు. పలు యాప్ ల పేరుతో  శ్రీనివాస్ మోసాలకు పాల్పడుతున్నారని  పోలీసులు గుర్తించారు.  ఫైవ్ స్టార్ హోటళ్లలో మకాం వేసి  శ్రీనివాస్  సైబర్ నేరాలకు  పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.  ప్రతి రోజూ  రూ 5 కోట్లు లక్ష్యంగా  శ్రీనివాస్  సైబర్ నేరాలకు  పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.  హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో  శ్రీనివాస్ బాధితులున్నారని  పోలీసులు  చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు  దేశ వ్యాప్తంగా  సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.  సైబర్ నేరాల విషయమై  పోలీసులు  ఎప్పటికప్పుడు  ప్రజలను అప్రమత్తం  చేస్తూనే  ఉన్నరు. కానీ  సైబర్ నేరగాళ్లు  కొత్త రూపంలో  నేరాలకు  పాల్పడుతున్నారు.   

PREV
click me!

Recommended Stories

vidadala rajini: రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారింది లోకేశ్ పై రెచ్చిపోయిన విడదల రజిని| Asianet Telugu
Heavy Rains Alert in AP: రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక| Asianet News Telugu