రమ్మీ, కాసినోకు బానిస: ఖాతాదారుల సొమ్ము కొట్టేసిన పీఎన్‌బీ క్యాషియర్

Siva Kodati |  
Published : Jun 03, 2020, 08:30 PM IST
రమ్మీ, కాసినోకు బానిస: ఖాతాదారుల సొమ్ము కొట్టేసిన పీఎన్‌బీ క్యాషియర్

సారాంశం

కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం వెలుగు చూసింది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుడ్రం రవితేజ చేతివాటం చూపించారు.

కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం వెలుగు చూసింది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుడ్రం రవితేజ చేతివాటం చూపించారు. ఖాతాదారుల నుంచి రూ.1.56 కోట్లు కొట్టేశాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ, కాసినో ఆటకు అలవాడు పడ్డ రవితేజ.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు.

ఖాతాదారుల నగదును తన ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాడు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనిఖీ చేయడంతో రవితేజ బాగోతం బయటపడింది. దీంతో ఆయన రవితేజపై నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu
YS Jagan Comments: రాంబాబు చేసిన పనికి పొగడాలి అంబటిపై జగన్ కామెంట్స్| Asianet News Telugu