షాక్: చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

Published : Jun 14, 2019, 02:28 PM IST
షాక్: చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

సారాంశం

ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని అనిల్ కుమార్ తన పిటిషన్‌లో ఆరోపించారు. చంద్రబాబు నాయుడి సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలని అనిల్‌ కుమార్‌ కోరారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనపై రిపబ్లిక్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని అనిల్ కుమార్ తన పిటిషన్‌లో ఆరోపించారు. చంద్రబాబు నాయుడి సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలని అనిల్‌ కుమార్‌ కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. 

PREV
click me!

Recommended Stories

AP Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తకు పండ‌గ‌లాంటి వార్త‌.. తైవాన్ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు
3వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam