వైఎస్ జగన్ కు షాక్: తిరుమల శ్రీవారి దర్శనంపై హైకోర్టులో పిటిషన్

Published : Oct 06, 2020, 05:08 PM IST
వైఎస్ జగన్ కు షాక్: తిరుమల శ్రీవారి దర్శనంపై హైకోర్టులో పిటిషన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణను మరో బెంచీకి బదిలీ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణను మరో బెంచీకి బదిలీ చేశారు. 

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోవడం దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153 లకు విరుద్ధమని గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన ఎ.సుధాకర్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు.  

హైకోర్టులో దాఖలైన కో-వారెంట్​ పిటిషన్ వేరే బెంచ్​కు బదిలీ కానుంది.సీఎం జగన్‌, మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, తితిదే ఛైర్మన్, ఈవో వారి పదవులు, పోస్టుల్లో ఏ అధికారంలో కొనసాగుతున్నారో వివరణ కోరాలని హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన కో-వారెంట్​ పిటిషన్‌ వేరే బెంచ్‌కు బదిలీ కానుంది. 

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమంటూ ఇటీవల పిటిషన్‌ దాఖలైంది.  డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు మద్దతు పలికారని తితిదే ఛైర్మన్, ఈవో నిబంధనల అమల్లో విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో వారు తమ పదవులు, పోస్టుల బాధ్యతలు నిర్వర్తించకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు. 

 జస్టిస్‌ ఏవీ శేషసాయి వద్ద మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది.  తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ తరఫున హాజరవుతున్నట్టు సీనియర్‌ వైవీ రవిప్రసాద్‌ తెలిపారు.  ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజ్యం వేరే బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చేలా తగిన నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli