ఉమ్మడి సిఎం అభ్యర్థి పవన్ కల్యాణ్: తణుకులో గర్జించిన జనసేనాని

Published : Aug 12, 2018, 09:34 PM ISTUpdated : Sep 09, 2018, 01:00 PM IST
ఉమ్మడి సిఎం అభ్యర్థి పవన్ కల్యాణ్: తణుకులో గర్జించిన జనసేనాని

సారాంశం

సోమవారం విజయవాడలో వామపక్షాలు, జనసేన ముఖ్యనేతల భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వామపక్షాలు, జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆదివారం సభ నిర్వహించారు. 

రాజమండ్రి: వామపక్షాలు, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  చెప్పారు. సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 15న విజయవాడలో మహాగర్జన, హిందూపురం, ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్రలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 

సోమవారం విజయవాడలో వామపక్షాలు, జనసేన ముఖ్యనేతల భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వామపక్షాలు, జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆదివారం సభ నిర్వహించారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 15 సీట్లు రావడానికి ప్రధాన కారణం తమ పార్టీయేనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తణుకు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జిల్లా ప్రజలను మోసం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, మన డబ్బుతో మన ఓట్లనే కొని.. మనల్నే టీడీపీ నేతలు దోచేస్తున్నారని  విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్ల‌తో కొత్త స‌బ్ స్టేష‌న్లలు | Asianet News Telugu