ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

Published : Aug 12, 2018, 09:17 PM ISTUpdated : Sep 09, 2018, 02:00 PM IST
ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

సారాంశం

డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం సద్దుమణగక ముందే తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం సద్దుమణగక ముందే తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న గీతిక తిరుపతి శివజ్యోతినగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని మరణించింది.

ఆత్మహత్య చేసుకున్న గీతిక స్వస్థలం కడప జిల్లాగా గుర్తించారు. విద్యార్థిని మృతిపై తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై మెడికల్ కాలేజీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

తాజాగా మరో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన కలకలం రేపుతోంది.

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?