పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారుణం.. నడుస్తున్న రైళ్లో నుంచి వ్యక్తిని తోసేసిన ప్రయాణికులు...

Published : Jun 16, 2023, 08:16 AM IST
పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారుణం.. నడుస్తున్న రైళ్లో నుంచి వ్యక్తిని తోసేసిన ప్రయాణికులు...

సారాంశం

కదులుతున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడుని తోసేశారు తోటి ప్రయాణికులు. సీట్ల విషయంలో వచ్చిన గొడవలో సర్ది చెప్పాలనుకోవడమే కారణం అని సమాచారం. 

అనంతపురం : ఏపీలోని అనంతపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడిని నడుస్తున్న రైల్లో నుంచి కిందికి తోసేశారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. రైల్లో ఇద్దరు ప్రయాణికులకు మధ్య సీట్ల విషయంలో గొడవ జరుగుతుండగా.. రమేష్ అనే వ్యక్తి సర్ది చెప్పబోయాడు. దీంతో కోపానికి వచ్చిన వారు అతడిని రైల్లో నుంచి తోసేశారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

YSRCP Leaders Protest at ABN Office: ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నాయకులు| Asianet Telugu
MP Ambica G Lakshminarayana Speech: అనంతపూర్ ఎంపీ అంబికా పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu