లంచం అడిగితే చెట్టుకు కట్టేయండి: వైసీసీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 31, 2020, 04:08 PM IST
లంచం అడిగితే చెట్టుకు కట్టేయండి: వైసీసీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సారాంశం

పలమనేరు వైసీసీ ఎమ్మెల్యే వెంకటగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం నాయకులు, అధికారులు లంచం అడిగితే వారిని చెట్టుకు కట్టేయాలని పిలుపు ఇచ్చారు.

పలమనేరు వైసీసీ ఎమ్మెల్యే వెంకటగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం నాయకులు, అధికారులు లంచం అడిగితే వారిని చెట్టుకు కట్టేయాలని పిలుపు ఇచ్చారు.

అలాంటి వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించదని వెంకటగౌడ అన్నారు. చెట్టుకు కట్టేసిన తర్వాత పోలీసులు, లేదా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.

నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం లబ్దిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వెంకటగౌడ ఆరోపించారు.

అలాంటి ఘటనలు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ఎమ్మెల్యే వెంకట గౌడ వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Launches HPV Vaccine Program at Cheepurupalli, Ravivalasa | Asianet News Telugu
AP Food Commissioner Laughs: వాళ్ళు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడంలేదు సార్ | Asianet News Telugu