చిత్తూరు : ‘‘ఆపరేషన్ గజ’’ సక్సెస్.. రెండ్రోజుల్లో ముగ్గురిని చంపిన ఏనుగు

Siva Kodati |  
Published : Aug 31, 2023, 03:21 PM IST
చిత్తూరు : ‘‘ఆపరేషన్ గజ’’ సక్సెస్.. రెండ్రోజుల్లో ముగ్గురిని చంపిన ఏనుగు

సారాంశం

చిత్తూరు జిల్లా వాసులను వణికించిన ఏనునుగు బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ గజ సక్సెస్ అయ్యింది. గురువారం రామాపురంలోని ఓ చెరుకు తోటలో వున్న ఏనుగుకు విజయవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా వాసులను వణికించిన ఏనునుగు బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ గజ సక్సెస్ అయ్యింది. రామాపురం వద్ద గురువారం మధ్యాహ్నం ఏనుగును బంధించారు అటవీ శాఖ అధికారులు. ఈ గజరాజం స్వైర విహారం చేస్తూ రెండ్రోజుల్లో ముగ్గురిని తొక్కి చంపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగును బంధించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో గురువారం రామాపురంలోని ఓ చెరుకు తోటలో వున్న ఏనుగుకు విజయవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!