బాలుడిని లైంగికంగా వేధించి, చంపి.. బండరాయికట్టి బావిలో పడేసి.. జవానే హంతకుడు...వీడిన ఒంగోలు హత్య మిస్టరీ..

Published : Jan 31, 2022, 08:49 AM IST
బాలుడిని లైంగికంగా వేధించి, చంపి.. బండరాయికట్టి బావిలో పడేసి..  జవానే హంతకుడు...వీడిన ఒంగోలు హత్య మిస్టరీ..

సారాంశం

దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ సైనికుడే నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై లైంగిక దాడిచేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్ లేని సిమ్ తో బెదిరింపు  డ్రామా ఆడాడు.  చివరకు పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తడంతో అర్ధరాత్రి పూట విఆర్వో ముందు లొంగిపోయాడు.

ఒంగోలు : ongoleలో దారుణ ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ చిన్నారిని ఓ కామాంధుడు కన్నూమిన్నూ కానక లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత దారుణంగా హతమార్చి.. ఏమీ తెలియనట్టు తప్పించుకు తిరిగాడు.. ఈ ఘటన జరిగిన పది రోజులకు పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. 

దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ jawan నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై molestation కు పాల్పడి.. ఆపై దారుణంగా murder చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్ లేని sim cardతో బెదిరింపు  డ్రామా ఆడాడు.  చివరకు పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తడంతో అర్ధరాత్రి పూట విఆర్వో ముందు లొంగిపోయాడు. 

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 22న జరిగిన బాలుడి హత్య వెనుక మిస్టరీ వీడింది.  ఈ వివరాలను ఎస్పీ మల్లికాగర్గ్ ఆదివారం ongoleలో మీడియాకు వెల్లడించారు. కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన భూమా శ్రీనాథ్ (11) ఈ నెల 22న స్నేహితులతో ఆడుకోడానికి వెళ్ళి అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనాథ్ కోసం పోలీసులు గాలిస్తుండగా 25వ తేదీన కత్తుల వానిపల్లి-ఎడమకల్లు గ్రామాల మధ్య ఉన్న రెడ్డిబావిలో మృతదేహం దొరికింది.

శరీరానికి రాయి కట్టి ఉండడంతో… హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో వారిని పక్కదారి పట్టించేందుకు  నిందితుడు ఇలాంటి సిమ్ కార్డును ఉపయోగించి బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే రూ. 50 లక్షలు ఇవ్వాలని లేకుంటే మరొకరిని చంపేస్తానని బెదిరించాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక తనను అరెస్టు చేస్తారని అర్థం చేసుకున్న దొండపాటి వెంకట ప్రశాంత్ (21) బాలుడిని తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ శనివారం అర్ధరాత్రి గ్రామ విఆర్వో వద్ద లొంగిపోయాడు. వీఆర్వో అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు.  అక్కపెల్లికి చెందిన ప్రశాంత్ పంజాబ్ లోని భటిండా రెజిమెంట్ లో  సైనికుడిగా పని చేస్తున్నాడు. సెలవులపై ఇటీవల ఇంటికి వచ్చాడు.

అశ్లీల వీడియోలు ఎక్కువగా చూసే ప్రశాంత్..  22వ తేదీన స్నేహితులతో ఆడుకుంటున్న శ్రీనాథ్ ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించుకున్నాడు. ఆ తర్వాత తన బైక్ మీద ఎక్కించుకుని రెడ్డి బావి వద్దకు తీసుకెళ్లాడు.  అక్కడ బాలుడిని భయపెట్టి..  లైంగికదాడి చేశాడు. బాలుడు పెద్దగా కేకలు వేస్తూ ఉండడంతో ప్రశాంత్ గొంతు పిసికి చంపేశాడు. మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడేసాడు. 

నిందితుడు వెంకట ప్రశాంత్ మీద ఐపీసీ సెక్షన్లు 364, 377, 302, 201, పోక్సో యాక్టు సెక్షన్ల కింద ఆరు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న మార్కాపురం ఓఎస్ డీ చౌడేశ్వరి, మార్కాపురం డిఎస్పి డాక్టర్ ఎమ్ కిషోర్ కుమార్, గిద్దలూరు సిఐ ఫిరోజ్ లను ఎస్పీ మల్లికా గర్గ్ అభినందించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్